కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 18: రాబోయే వర్షాకాలం నాటికి ఎస్ఎన్డీపీ పనులను పూర్తిచేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆయా శాఖల అధికారులు, ఏజెన్సీల ఆదేశించారు. నియోజకవర్గంలో రూ. 149 కోట్ల వ్యయంతో నడుస్తున్న ఎస్ఎన్డీపీ పనుల పురోగతిపై మంగళవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేట్బషీరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపుగా 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎస్ఎన్డీపీ పనులకు ఎలాంటి నిధుల ఇబ్బందులు లేవని, మంత్రి కేటీఆర్ సహాకారంతో మరి న్ని నిధులు తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని, నాణ్యతతో పాటు సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఈ ఆనంద్, ఈఈలు నారాయణ, కృష్ణచైతన్య, డీఈఈలు నరేందర్, నళిని, ఏఈ రామారావు, నాగరాజు, నారాయణ, కొంపల్లి మున్సిపాలిటి చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, పలువురు కార్పొరేట ర్లు రవికిరణ్, సురేశ్రెడ్డి, ఆగం రాజు, ఆగం పాండు, కాసాని సుధాకర్, జ్యోతితో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సుపరిచిత పరిపాలనను అందిస్తూ ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించే లక్ష్యంగా పని చేస్తున్నానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేపట్టిన ప్రగతియాత్ర మంగళవారం నాటికి 47వ రోజుకు చేరుకుంది. మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీశ్, బొడ్డు వెంకటేశ్వర్రావులతో కలిసి గణేష్నగర్లో విస్తృతంగా పర్యటించారు. కాలనీల్లో చేసిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలతో చర్చిస్తూనే ఇంకా చేయాల్సిన మిగిలిన పనులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రజలకు సుపరిచితంగా ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అన్నీ రకాల చర్యలు తీసుకున్నానన్నారు. సీఎం కేసీఆర్, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ల సహకారంతో కుత్బుల్లాపూర్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మిగిలిన అన్నీ రకాల పనులను పూర్తి చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిశోర్చారి, నార్లకంటి బాలయ్య, జయంచారి, మధుకర్రెడ్డి, వెంకటేశ్, అజ య్, కాలనీవాసులు నర్సింహారెడ్డి, భాస్కర్గౌడ్, మురళి, శ్రీనివాస్, దుర్గారావు, లింగంయాదవ్, వనం శ్రీనివాస్, యాదగిరి, సంజీవరెడ్డి, చంద్రశేఖర్, రమ్యకృష్ణ, భవానీ తదితరులు పాల్గొన్నారు.