బంజారాహిల్స్,మార్చి 21: ఖాళీ తిరగకుండా ఏదైనా పనిచేసుకోవచ్చు కదా అంటూ తల్లి మందలించడంతో (Mother scolded) ఓ యువకుడు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడ్డాడు. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిలింనగర్ రోడ్ నెం 9లోని(Filmnagar) అంబేద్కర్నగర్లో నివాసం ఉంటున్న శనిగరం కిరణ్(20) ఏ పనిచేయకుండా స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. ఏదైనా పని చేసుకోవాలంటూ చాలాసార్లు తల్లి జ్యోతితో పాటు కుటుంబసభ్యులు అతడికి చెప్పినా వినిపించుకోకపోవడంతో పాటు గొడవలకు దిగేవాడు.
ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన కిరణ్ను మరోసారి తల్లి మందలించింది. అర్ధరాత్రి దాకా ఎందుకు ఇలా తిరుగుతున్నావంటూ ప్రశ్నించగా తల్లితో తీవ్రస్థాయిలో గొడవకు దిగిన కిరణ్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అరగంట తర్వాత తల్లి జ్యోతి గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకున్న కిరణ్ కనిపించాడు.
స్థానికుల సాయంతో అతడిని కిందకు దింపి అపోలో జనరల్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం జ్యోతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.