కవాడిగూడ : కరోనా నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేసిన ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ఈ మేరకు శుక్రవారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని యూపీహెచ్సీ సెంటర్లో రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ మంజూరి చేసిన స్మార్ట్ ఫోన్లను 19 మంది ఆశా వర్కర్లకు ఆయన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ, యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మీలతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కరోనా పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, తదితర సమాచారాన్ని పొందుపరుచడానికి ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను ఇవ్వడం మంచి కార్యక్రమమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, మాజీ అధ్యక్షులు కల్వ గోపీ, రాంచందర్, నాయకులు రాజశేఖర్ గౌడ్, ముచ్చకుర్తి ప్రభాకర్, తదితర ఆశా వర్కర్లు పాల్గొన్నారు.