చెన్నై, మే 22: ఆకాశానికి ఎగబాకుతున్న పసిడి ధరలతో కాంచీపురం పట్టు చీరల ధరలు పోటీపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పుత్తడి రేట్లు పెరుగుతుండడంతో ఆ మేరకు పట్టుచీరల ధరలు కూడా పెరుగుతున్నాయి. కాంచీపురం పట్టుచీరల్లో ఎక్కువగా బంగారం, వెండి జరీని ఉపయోగిస్తారు. దీంతో బంగారం ధరలతోపాటు చీరల ధరలు కూడా పెరిగాయి. గత 8 నెలల్లో ఏకంగా 50 శాతం వరకు ధరలు పెరగడంతో మగువలు ఆ చీరలవైపు చూడాలంటేనే భయపడుతున్నా రు. చీరల వ్యాపారం దారుణంగా పడిపోయిందని వ్యా పారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంచీపురం సిల్క్ చీరల్లో స్పెషలిస్ట్ బ్రాండ్ అయిన ఆర్ఎంకేవీ వ్యా పారం 20 శాతం పడిపోయింది.