కవాడిగూడ ( హైదరాబాద్) : ప్రభుత్వం పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్( Mutha Gopal) అన్నారు. బుధవారం భోలక్పూర్ డివిజన్లోని అంజుమన్ ఫంక్షన్ హాల్లో హిమాయత్ నగర్, ముషీరాబాద్ మండలాల పరిధిలోని 90మంది లబ్దిదారులకు షాదీముబాకర్, కల్యాణ లక్ష్మి (kalyana laxmi ) చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్దికి పెద్దపీట వేసిందని అన్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు అవసమరైన ఆర్థిక సహాయం నాటి సీఎం కేసీఆర్ (KCR) పకడ్బందీగా అమలు చేశారని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచుకు లక్షా రూపాయలు అందించి ఆదుకున్నారని వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించు కోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జైసింహ, బీఆర్ఎస్ భోలక్పూర్ ఉపాధ్యక్షుడు ఎ. శంకర్ గౌడ్, కల్యాణ్, రహీం, మున్వర్ చాంద్, దీన్ దయాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.