వనస్థలిపురం : ఇబ్రహీంపట్నం కర్ణంగూడ కాల్పుల్లో గాయపడిన రఘువీర్రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయం 9గంటలకు బీఎన్రెడ్డినగర్లోని బృంగి హాస్పిటల్కు ఆయనను తీసుకువచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు చికిత్స అందించారు.
ఛాతినుంచి లివర్ మీదుగా బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు బాధితుడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. మద్యాహ్నం 12గంటల సమయంలో రఘువీర్రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మీర్పేట ఆర్ఎన్రెడ్డినగర్లో నివాసముండే రఘువీర్రెడ్డి గతకొంత కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది.
కాగా మృతుడు గతంలో హత్యకేసులో జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి వచ్చినట్లు తెలుస్తోంది.