బంజారాహిల్స్, ఆగస్టు 20 : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10లోని ఉదయ్నగర్లో నివాసం ఉంటున్న నరేష్(40) గచ్చిబౌలిలోని ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఇటీవల భార్యతో గొడవలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లడంతో నరేష్ ఒంటరిగా ఉంటున్నాడు.
గురువారం రాత్రి తన గదిలో తమరో ఇద్దరు స్నేహితులు జితేందర్, విష్ణులతో కలిసి మద్యం సేవించాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత వారిద్దరూ వెళ్లిపోయారు.
తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మెట్లపై నుంచి కిందికి వచ్చిన నరేష్ ఇంటి బయట కింద పడి అపస్మాక స్థితిలో కనిపించాడు. స్థానికులు 108 సహాయంతో అతన్ని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తేలింది. మద్యం మత్తులో కింద పడి మృతి చెందాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.