రవీంద్రభారతి, డిసెంబర్ 18: తెలంగాణ మూవీ, ఆర్టిస్ట్ యూనియన్ పదవ కుటుంబ కళోత్సవ వార్షికోత్సవాలు ఆదివారం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ హాజరై ప్రసంగించారు. సినిమాకు కులం, మతం, ప్రాంతాలు ఉండవని, ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే సినిమా అని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్ కారణంగా సినీ పరిశ్రమలు కుదేలయ్యాయని, రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు పృథ్వీరాజ్ కోరారు. సినీ పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వాలు ఆర్టిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ మూవీ ఆర్టిస్టు యూనియన్ వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్కుర్మాచలం, తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సీపీఎస్ఎన్ దొర, ప్రముఖ నిర్మాత సామాజిక సంఘ సంస్కర్త ప్రశాంత్గౌడ్, హీరో ప్రదీప్, ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు నండూరి రాము, పద్మరేఖ, శ్రీనివాస్ రాథోడ్, మునీంద్రబాబు, నూకరాజు, కేపీ రెడ్డి, గోంగూర శ్రీనివాస్, కనకదుర్గమ్మ, వీరేశ్, మాధురి, ఆరుణ, రామ్మోన్రావు, పలువురు సినీ ఆర్టిస్టులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.