శంషాబాద్ రూరల్ : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం దేశపాగ దర్శన్ (40) గత ఏడాది నుంచి పెద్దగోల్కొండ గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు.
సోమవారం ఉదయం చెత్తను సేకరిస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు గోడకు ఢీకొని ట్రాక్టర్ పై నుంచి కిందపడిపోయాడు. విషయం గమనించిన సర్పంచ్ లక్ష్మయ్య వెంటనే అక్కడికి చేరుకొని చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ప్రైయివేటు దవాఖానకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పోస్టుమార్ఠం నిమిత్తం నగరంలోని ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.