జూబ్లీహిల్స్,నవంబర్26: భారత రాజ్యాంగం విశిష్టమైనదని.. దీని ప్రాముఖ్యతను ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ ఏకే మిశ్రా పేర్కొన్నారు. శనివారం యూసుఫ్గూడ ప్రథమ పటాలంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూడవ పటాలం అధికారి కమాండెంట్ సన్నీ, బెటాలియన్ అధికారులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ వీరయ్య, అసిస్టెంట్ కమాండెంట్ జవహర్లాల్, సత్యనారాయణ, అప్పరాయ్, ఆర్ఐలు సురేశ్, ధర్మారావు, సాంబయ్య, శంకర్, రాజేశం, ఆర్ఎస్ఐ , బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఖైరతాబాద్, నవంబర్ 26 : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సౌత్ ఇండియా అడ్వకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సౌత్ ఇండియా అడ్వాకేట్ జేఏసీ అధ్యక్షుడు నరేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ నంద, సీనియర్ న్యాయవాదులు మల్లేశ్వర్ రావు, వెంకటేశ్వరి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘునాథ్, జెల్లి నరేందర్ తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. బార్ కౌన్సిల్ సభ్యులు పాలకుర్తి కిరణ్, ఎంఏ ముఖీద్, మీర్ మసూద్ ఖాన్, మహ్మద్ వహీద్ అలీ ఖాన్, తెలంగాణ ఏజీపీ ఏజీపీ వంశీ కిషన్, న్యాయవాది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్,నవంబర్26: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరిని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం మన దేశానికి మకుటంగా నిలుస్తుందని రహ్మత్నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఘట్టయ్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరావునగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు విజయ్తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, పరుశురాములు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్, నవంబర్ 26: రాజ్యంగంలో పొందుపరిచిన హక్కులు,విధులు,చట్టాలే ప్రజలకు రక్షణ అని, రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేస్తూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని జిల్లా న్యాయ సేవాసాధికారిక సంస్థ కార్యదర్శి మురళి మోహన్ సూచించారు. ఎల్లారెడ్డిగూడలోని పడాల రామిరెడ్డి లా కళాశాలలో శనివారం రాజ్యంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..భావస్వేచ్ఛ ప్రకటన, లౌకికవాదం, సమాన హక్కులు, వివక్షరహిత సమాజ నిర్మాణాన్ని రాజ్యాంగం కాక్షించిందన్నారు. విద్యార్థులతో మురళీ మోహన్ రాజ్యంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయించారు. లా కళాశాల కార్యదర్శి రాజేశ్వర్రావుతో పాటు అధ్యాపకులు,సిబ్బంది పాల్గొన్నారు.