జూబ్లీహిల్స్, మే 29: నగరంలో సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ జిల్లాల క్రీడాకారులతో నగరం క్రీడా సంగ్రామంగా మారిపోయింది. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియం బాస్కెట్బాల్, రెజ్లింగ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నది. సోమవారం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్.వేణుగోపాలచారి, సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్తో కలిసి పలు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 మంది క్రీడాకారులు హాజరైనట్లు క్రీడల ఇన్చార్జి మేనేజర్ రవీందర్ తెలిపారు.
రెజ్లింగ్ పోటీల 57 కేజీల విభాగంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన పి.విష్ణు (గోల్డ్), నిర్మల్ జిల్లాకు చెందిన ఎం.ఆకాశ్ (సిల్వర్), రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎన్.సందీప్కుమార్ బ్రౌంజ్ మెడల్ దక్కించుకున్నారు. రెజ్లింగ్ 86 కేజీల విభాగంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన సాహిల్ సింగ్ (గోల్డ్), రంగారెడ్డి జిల్లాకు చెందిన జి.నరేందర్ (సిల్వర్), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎ.వెంకట్ ప్రసాద్ బ్రౌంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు.
బాస్కెట్బాల్లో మహబూబాబాద్ జిల్లాపై 60-35 స్కోరుతో రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాపై 32-21 స్కోరుతో ఖమ్మం, నల్గొండపై 46-38 స్కోరుతో మహబూబ్నగర్, కామారెడ్డిపై 20-04 స్కోరుతో మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్పై 39-34 స్కోరుతో జగిత్యాల, సంగారెడ్డిపై 62-43తో హన్మకొండ, సూర్యపేటపై 48-27 స్కోరుతో భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్పై 45-13 స్కోరుతో హైదరాబాద్ జిల్లా జట్లు విజయం సాధించాయి. క్రీడా ప్రాంగణాల్లో హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
ఆర్కేపురం: సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. సోమవారం వాలీబాల్, కబడ్డీ, జిమ్నాస్టిక్ పోటీలు నిర్వహించారు.