కీసర, ఏప్రిల్ 21: కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, బీభత్సం సృష్టించింది. ఈ ఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలోని రాంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాంపల్లిలోని ఆర్ఎల్నగర్లో శనివారం అర్ధరాత్రి కారు అతివేగంగా వచ్చి.. మెయిన్ రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారులో ఉన్న కార్తిక్ భరద్వాజ్. కౌశిక్ భరద్వాజ్కు తీవ్ర గాయాలయ్యాయి.
విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగిపోయింది. ఈ ప్రమాదం తెలుసుకున్న కీసర పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. జేసీబీ సహాయంతో కారుపై పడిపోయిన స్తంభాన్ని తొలగించారు. కారులో చిక్కుకున్న ఇద్దరిని కూడా బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.