బేగంపేట్, జూన్ 15: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని భరణి కాంప్లెక్స్కు ఆనుకొని ఉన్న నాలా పరిధిలోకి వచ్చే బఫర్ జోన్ స్థలం కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తూ..‘నమస్తే’లో ప్రచురితమైన కథానానికి అధికారులు స్పందించారు. బల్దియా కమిషనర్ ఆదేశాల మేరకు అమీర్పేట సర్కిల్ అధికారులు సోమవారం నాలా పక్కన బఫర్ జోన్లో స్థలంలోకి వెళ్లకుండా ఏర్పాటు చేసిన గేట్ను తొలగించారు. బఫర్ జోన్లో ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ గేట్లు ఏర్పాటు చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్టు జీహెచ్ఎంసీ అమీర్పేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి రాజశ్రీ తెలిపారు.