చాంద్రాయణగుట్ట : ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలకు ఓ గుర్తు తెలియని దుండగుడు నిప్పు పెట్టాడు.ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు పాక్షికంగా కాలిబూడిదయ్యాయి. మంగళవారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం..
హషామాబాద్ ప్రాంతంలో నివసించే మహ్మద్ ఇలియాస్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాలను రోజు మాదిరిగానే ఇంటి ముందు పార్కింగ్ చేశాడు.అనంతరం భోజనం చేసి నిద్రపోయాడు.అర్థరాత్రి సమయంలో శబ్ధం రావడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు.అప్పటికే రెండు వాహనాలు కాలిపోయాయి.
చుట్టుపక్కల ఏవరూ కనిపించలేదు. దీంతో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ యువకుడు అర్థరాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టడం కనిపించింది.వెంటనే వాహనాల యాజమని మహ్మద్ ఇలియాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.