అబిడ్స్, మే 12ః ముల్తానిపురా దొంగతనం మిస్టరీని గోషామహల్ పోలీసులు చేధించి ఒకరిని అరె స్ట్ చేసి యాభై లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ కేసు వివరాలను వెల్లడించారు. ముల్తానిపురాలోని మూడవ అంతస్తులో నివాసం ఉంటున్న మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి రోజు ఇంటికి తాళం వేసి పెండ్లి పనులకు వెళ్లి వస్తున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన అతని బంధువు దొంతుల రాజేష్ గమనించాడు. ఆన్లైన్ బెట్టింగ్లతో నష్టాలకు గురైన ఆయన మహే ష్ నివాసంలో దొంగతనం చేసి అప్పులు తీర్చాలనుకున్నాడు. ఆదివారం రాత్రి మహేష్ ఇంట్లోకి చొరవడి అల్మారాలోని 30 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నరకు పైగా వెండి సామాగ్రి, ఐదు లక్షల నగదు ఇతర సామాగ్రిని దొంగిలించి పరారయ్యాడు. దొంగిలించిన సామాగ్రిని ఒక సంచిలో పెట్టి లోపలి గదిలో దాచి పెట్టాడు. యధావిధిగా ఎవరికీ అనుమానం రాకుండా ఆటో నడపడానికి వెళ్లాడు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహేష్కు తెలిసిన తెలిసిన వారు దొంగతనం చేసి ఉంటారని సమీపంలోని రాజేష్ ఇంటికి వెళ్లారు. అప్పుడే ఇంటికి వచ్చిన రాజేష్ను ప్రశ్నించగా తడబడుతూ సమాధానం ఇవ్వడంతో పోలీసులు అతన్ని గట్టిగా నిలదీశారు. రాజేష్ దొంగిలించిన విషయాన్ని అంగీకరించాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి దొంగిలించిన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు మిస్టరీని చేధించిన ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్కు డీసీపీ రివార్డ్స్ ఇచ్చి ప్రశంసించారు. గోషామహల్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యం లో ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్, ఎస్ఐ అజిత్లు దర్యాప్తు చేస్తున్నారు.