సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): ధ్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.7డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2డిగ్రీలు, గాలిలో తేమ 32శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రెండు రోజులతో పోల్చితే నగరంలో కొంత వేడి తీవ్రత ఎక్కువగా ఉందని, మరో రెండు రోజుల వరకు ఇదే తీరుగా వాతావరణం ఉంటుందని అంచనా వేశారు.