సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులతో ఎండలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు అడపా దడపా కురిసిన వానలతో కాస్త చల్లబడిన వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఉష్ణోగ్రత 40డిగ్రీలను దాటేసింది. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో వడదెబ్బ ముప్పు పొంచి ఉన్నదని, ముఖ్యంగా వేసవిలో వివిధ పనులపై బయటకు వెళ్లే వారు అతి జాగ్రతగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, కిడ్నీ వ్యాధి గ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ప్రత్యేక జాగ్రతలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
35డిగ్రీలు దాటితే వడదెబ్బ తప్పుదు
సాధారణంగా మానవుడు 32డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలడు. అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత పడినప్పుడు పలు రకాల వ్యాధులు తలెత్తే అవకాశముంటుందని వైద్యులు తెలుపుతున్నారు. 35డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు వడదెబ్బ సమస్య ఏర్పడుతుందని, 38-40డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ప్రాణాంతకంగా మారే ప్రమాదముందని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వివరించారు.
వడదెబ్బ వీటిపై ప్రభావం చూపుతుంది
సాధారణంగా ఎండలో తిరిగినప్పుడు వారిపై సూర్యకిరణాలు పడడం వల్ల మనిషి ఒంట్లో ఉన్న లవణాలు చెమట రూపంలో బయటకు వచ్చి ఆవిరైపోతాయి. దీంతో రోగి నీరసించిపోతాడు. నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్కు గురై, కొన్ని సార్లు ప్రాణాంతకంగా మారే ప్రమాదం లేకపోలేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండలో బయటకు రాకపోవడం మంచిది
సాధ్యమైనంత వరకు ఎండలో బయటకు రాకపోవడం మంచిది. ఏవైన బయట పనులు ఉంటే ఉదయం 11గంటల్లోపు లేదా సాయంత్రం 5గంటల తరువాత పెట్టుకోవడం మంచిది. ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు టోపీ లేదా గొడుగు వంటివి వినియోగించాలి. తరచూ మంచినీరు తాగడం మరిచిపోవద్దు. కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, ఉప్పు, చక్కెర కలిపిన ద్రావణం తరచూ తాగాలి. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే దగ్గరలో ఉన్న దవాఖానకు తరలించాలి.
– డాక్టర్ వెంకటి, హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
వడదెబ్బ వల్ల కలిగే అనర్ధాలు
వడదెబ్బ లక్షణాలు