హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా విశ్వకర్మల చేతివృత్తులను ఆధునికీకరించి వారి నైపుణ్యాలను విశ్వవ్యాప్తం చేస్తామని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణ సమాజం 60 ఏండ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను గత ఏలికలు విస్మరించారని, వాటన్నింటినీ కేసీఆర్ మాత్రమే సమర్థంగా పరిషరిస్తారని భరోసా ఇచ్చారు. కేటీఆర్ను సోమవారం ప్రగతిభవన్లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రత్యేకంగా కలిసి విశ్వబ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
నేత, గీత కార్మికులకు ఇస్తున్నట్టుగా యాభై ఏండ్లు దాటిన విశ్వబ్రాహ్మణులకు పెన్షన్సీమ్ వర్తింపజేయాలని, విశ్వకర్మ చేతివృత్తిదారులకు 250 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని, విశ్వకర్మలు ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందజేయాలని కోరారు. అందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. విశ్వకర్మీయుల ఉత్పత్తులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా వారి నైపుణ్యాలు మెరుగుపడి వారు ఉత్పత్తి శక్తులుగా ఎదుగుతారని, అందుకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
విశ్వకర్మలకు దేశంలో ఎకడాలేని విధంగా రాజధానిలో ఐదు ఎకరాల స్థలమిచ్చి ఆత్మగౌరవ భవన నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వమే చేపట్టిందని, భవిష్యత్లో ఈ ఆత్మగౌరవ భవనాలు చేతివృత్తుల జ్ఞాన కేంద్రాలుగా, సాంకేతిక జ్ఞానంతో పొద్దుపొడిచే అభివృద్ధి కేంద్రాలుగా వెలుగొందుతాయని వివరించారు. విశ్వబ్రాహ్మణులతోపాటు మొత్తం బహుజనవర్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కడుపులో పెట్టి దాచుకుంటుందని తెలిపారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంకలనం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విశ్లేషణ ‘కాంగ్రెస్ చేసిందేంది?’ అనే పుస్తకాన్ని కేటీఆర్ ఆవిషరించారు. కాంగ్రెస్ ఏం వెలగబెట్టిందో ఈ పుస్తకం బయటపెట్టిందని వివరించారు. డిసెంబర్ 3న తెలంగాణ అంతా గులాబీమయం కాబోతున్నదని చెప్పారు.