బోడుప్పల్, మార్చి 24: ఇంటి నిర్మాణ అనుమతులను సరళీకృతం చేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీఎస్ బీపాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) దేశంలోనే నం. 1గా నిలుస్తున్నది. ఈ పథకంతో బోడుప్పల్లో అద్భుత సత్ఫలితాలు వచ్చాయి. గడిచిన రెండేళ్ల కాలంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీఎస్ బీపాస్ ద్వారా ఇప్పటివరకు 4,150 ఇంటి అనుమతులను ఆన్లైన్ ద్వారా జారీచేసింది.
ఈ మేరకు కార్పొరేషన్కు దాదాపు రూ.12కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో పాలకవర్గం నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఒకప్పుడు ఇంటి పర్మిషన్ కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి ముడుపులు ముట్టచెప్పనిదే ఫైల్ ముందుకు కదిలేది కాదు. ఇప్పుడా పరిస్థితుల నుంచి నగర ప్రజలు పూర్తిగా ఉపశమనం పొం దారు. టీఎస్బీపాస్ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఇంటి నిర్మాణాలపై నోటీసులు ఇవ్వకుండానే అధికారులు కూల్చివేసే ఆస్కారం ఉంది.
టీఎస్బీపాస్తో ఇంటి అనుమతుల జారీ పక్రియ సరళీకృతమైంది. దీంతో గృహ నిర్మాణాల అనుమతుల జారీ వి షయంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా ఇంటి అనుమతులు జారీ అవుతున్నాయి. 2 సంవత్సరాల కాలంలో టీఎస్బీపాస్ ద్వారా 4వేల పైచిలుకు ఇంటి పర్మిషన్లు జారీ అయ్యాయి. దీంతో దాదాపు రూ.12కోట్ల ఆదాయం సమకూరింది.
– రాధకృష్ణారెడ్డి, పట్టణ ప్రణాళికా విభాగం అధికారి
ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీ పాస్ ఎంతో బాగుంది. గతంలో నిర్మించిన ఇంటి పర్మిషన్కు ఎంతో ఇబ్బంది పడ్డాం. లంచాలు ఇవ్వనిదే పనికాలేదు. నేడు బోడుపల్ప్లో కట్టుకున్న ఇల్లుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో పర్మిషన్ పొం దాం. దరఖాస్తు చేసుకున్న 10రోజుల్లో ఇంటి పర్మిషన్ వచ్చింది.
– అరుణ, ఈస్ట్ బాలాజీహిల్స్కాలనీ