సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఐదు పతకాలతో క్రీడా ప్రపంచంలో తనదైన ముద్రవేసింది జహ్రా ముఫద్దల్ దీసవాలా. షాట్గన్ ఈవెంట్స్లో తెలంగాణ నుంచి టాప్ షూటర్గా నిలిచింది. న్యూఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్లో 66వ జాతీయ షుటింగ్ చాంపియన్షిప్ పోటీలు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 2 వరకు షాట్గన్ ఈవెంట్స్ జరిగాయి. జూనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం, జూనియర్ మహిళల టీమ్ విభాగంలో బంగారు పతకం, మహిళల వ్యక్తిగత విభాగంలో రజత పతకం, మహిళల జట్టు విభాగంలో రజతం, ఈవెంట్ టీమ్ విభాగంలో బంగారు పతకాలు సాధించింది. హైదరాబాద్కు చెందిన జహ్రా ప్రస్తుతం లయోలా కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నది. బెరెట్టా బ్రాండ్, డీటీ11 నుంచి ఆమె షాట్గన్తో తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని తెలిపారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో షూటింగ్ రేంజ్లో తర్ఫీదు పొందుతూ ఈ ఘనతను సాధించింది. దేశం కోసం ఒలింపిక్ కోటా పొందాలని, త్వరలో ఒలింపిక్స్లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించాలనేది తన కల అని తెలిపింది.