సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పోలింగ్ స్టేషన్లకు చుట్టూ 200 మీటర్ల దూరం వరకు గుంపులు గుంపులుగా ఉండవద్దని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు నగరంలో అమలులో ఉంటాయన్నారు. అలాగే, కర్రలు, లాఠీలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో తిరగడం నిషేధమని, పోలింగ్ స్టేషన్కు కిలో మీటర్ దూరం వరకు ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు.
తాత్కాలికంగా ఎలాంటి ఏర్పాట్లు కూడా పబ్లిక్ ప్లేసెస్లో చేయవద్దని, మైక్లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు, నిషేధిత ఫొటోలు, సింబల్స్, ప్ల కార్డులు, కులమత ద్వేషాలను రెచ్చగొడుతూ రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టి విధంగా ప్రసంగాలు చేయడంపై నిషేధాజ్ఞాలు విధించినట్లు తెలిపారు. అయితే, విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిల్టరీ, ఎలక్షన్ అధికారులు, సిబ్బందికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉన్నదని సీపీ పేర్కొన్నారు.