రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త
ఖైరతాబాద్, మే 29: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం టూరిజం హబ్గా మారుతున్నదని టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అ న్నారు. ఆదివారం సాయంత్రం నెక్లెస్రోడ్ పీవీ మార్గ్లోని పీపుల్స్ప్లాజాలో ఏ ర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళాను శ్రీనివాస్ గుప్త సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యత లు చేపట్టిన తర్వాత గ్రేటర్ పరిధిలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, పర్యాటక ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అనంతరం సమ్మర్ ఉత్సవ్ మేళా నిర్వాహకుడు మీర్జా రఫీక్ బేగ్ ఆర్థిక సహకారంతో సమకూర్చిన వీల్ చైర్ను ఎంఎస్ మక్తాకు చెందిన మహ్మద్ సోహెల్ (13)కు అందజేశారు. అనంతరం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక స్థలాలు, రాష్ట్ర అభివృద్ధి సూచికలను ప్రదర్శిస్తూ పీపుల్స్ప్లాజాలోని సమ్మర్ ఉత్సవ్ మేళాలో ఏర్పాటు చేసిన డిస్ప్లేను ప్రారంభించారు.