హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గుడి మల్కాపూర్, దేవాదాయ శాఖ కార్యాలయంలో.. 309 దేవాలయాలకు కోటి 3 లక్షల రూపాయల విలువైన బోనాల చెక్కులను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. 3,500 కు పైగా దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
గతంలో బోనాల తర్వాత చెక్కులను అందించాం. ఈ సంవత్సరం బోనాలకు ముందే చెక్కులను అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు.