హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్ దేశానికే రోల్ మోడల్ అని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని విద్యుత్ సౌధలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేసి, ప్రసంగించారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో విద్యుత్ రంగం అభివృద్ధి కోసం రూ.36,918 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామన్నారు. 26.90 లక్షల పంపుసెట్లకు 24 గంటలూ ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను నిర్మించామని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈవీ చార్జింగ్ స్టేషన్లకు సరిపడా విద్యుత్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఎస్ ట్రాన్స్కో జేఎండీ సి.శ్రీనివాసరావు, డైరెక్టర్లు జి.నర్సింగ్రావు, టి.జగత్రెడ్డి, జె.సూర్యప్రకాశ్, బి.నర్సింగ్రావు, టీఎస్ జెన్కో డైరెక్టర్లు టీఆర్కే రావు, సీహెచ్ వెంకటరాజం, సచ్చిదానందం, ఎస్.అశోక్కుమార్, బి.లక్ష్మయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో..
హైదరాబాద్లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంస్థ డైరెక్టర్లు టి. శ్రీనివాస్, కె.రాములు, జి.పర్వతం, సీహెచ్. మదన్మోహన్ రావు, స్వామిరెడ్డి, నరసింహా రావు, జి.గోపాల్, సీవీవో కె.మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
పవర్ గ్రిడ్ హెడ్ క్వార్టర్స్లో..
సికింద్రాబాద్లోని పవర్గ్రిడ్ ఎస్ఆర్టీఎస్-1 (సదర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్) హెడ్ క్వార్టర్స్లో ఎస్ఆర్టీఎస్-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాత్సవ పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో చీఫ్ జీఎం ఎన్వీపీ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యామండలిలో..
మాసబ్ ట్యాంకులోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయ ఆవరణలో చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యదర్శి శ్రీనివాసరావు, మండలి సభ్యులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.