చాంద్రాయణగుట్ట,జూన్ 15 : లాల్దర్వాజలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగను జూలై 7 నుంచి భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని ఆలయ చైర్మన్ చెన్నబోయిన రాజేందర్ యాదవ్ తెలిపారు. గురువారం ఆలయ అవరణలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జూలై 7న ప్రత్యేక గణపతి హోమం, 9న శాలిబండ కాశీవిశ్వనాథస్వామి ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించడం, 16న బోనాల సమర్పణ, 17న పోతురాజు స్వాగతం, భవిష్యవాణి(రం గం) వంటి ముఖ్యమైన కార్యక్రమాలు బ్రహ్మాండగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం బ్రోచర్ విడుదల చేశారు. సమావేశంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బి.మారుతియాదవ్, కోశాధికారి పి.సదానంద్ ముదిరాజ్, కన్వీనర్ అరవింద్ కుమార్గౌడ్,మాజీ చైర్మెన్లు సి.వెంకటేశ్, బంగ్లా రాజు యాదవ్, మాణిక్ ప్రభుగౌడ్, పోసాని విజయ్ కుమార్, సి.రాజ్కుమార్ యాదవ్, కె.వెంకటేశ్, శీరారాజ్కుమార్ కురుమ, జె.లక్ష్మీనారాయణగౌడ్ పాల్గొన్నారు.
ఢిల్లీలో లాల్దర్వాజ బోనాలు..
లాల్దర్వాజ సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించన్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ తెలిపారు. జూన్ 19న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్ ప్రాగణంలో ఫొటో ఎగ్జిబిషన్, 20 సాయంత్రం 5 గంటలకు ఇండియా గేట్ నుంచి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తెచ్చి తెలంగాణ భవన్లో ప్రతిష్ఠించడం, 21న ఉదయం 11 గంటలకు పోతురాజు స్వాగతం, అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 100 మంది కళాకారులు వివిధ రూపాల్లో తమ అద్భుతమైన ప్రదర్శన కొనసాగించనున్నట్లు లాల్దర్వాజ ఆలయ ప్రతినిధులు స్పష్టం చేశారు.