హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రేపు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేశామన్నారు.
భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారి కళ్యాణం జరిగేందుకు భక్తులు అధికారులు, వాలంటీర్లకు సహకరించాలని కోరారు.