ఎల్బీనగర్, సెప్టెంబర్ 12 : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్గౌడ్ అన్నారు. ఆదివారం కొత్తపేట డివిజన్లోని రాజీవ్గాంధీనగర్లో లింగాల రాహుల్గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్గౌడ్ మాట్లాడుతూ.. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారని, ప్రతి ఒక్కరూ తమ కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు.
కంటి పరీక్షలను బస్తీల్లో ఉచితంగా పరీక్షలు చేయిస్తున్నామని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రమావత్ దీల్లాల్, మల్లెపాక యాదగిరి, కిషన్, బొట్టు ఆంజనేయులు, ఇటికాల యాదగిరి, జేబీ తదితరులు పాల్గొన్నారు.