జిల్లాలో నమోదయ్యే అట్రాసిటీ కేసులను త్వరితగతిన విచారించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. వర్చువల్ విధానంలో డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పీసీఆర్, అండ్ పీవోఏ చట్టాల కింద నమోదైన కేసులపై పోలీసులు, సంబంధిత అధికారులు, డీవీఎంసీ సభ్యులతో సమీక్షించారు. అనంతరం, కలెక్టర్ మాట్లాడుతూ అట్రాసిటీ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ అందగానే తగిన నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు. నిర్ణీత ప్రాంతాల్లో, నిర్దేశిత సమావేశాల్లో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి, అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ప్రభాకర్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు, డీవీఎంసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.