ఘట్కేసర్,నవంబర్30:ప్రస్తుతం ఫార్మసీ విద్యకు ఆదరణ పెరుగుతున్నదని సీసీఎంబీ సీఈఓ డాక్టర్ ఎన్.మధుసూదన్రావు అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లోని సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో ఫార్మసీ,ఫార్మాడీ మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం (విద్యార్థి ప్రేరణ)ఇండక్షన్ కార్యక్రమాన్ని కళాశాల డైరెక్టర్ మల్లాడి రమాకాంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.ప్రస్తుతం కరోనా వంటి వ్యాధులు వెలుగులోకి రావడంతో వీటిపై నిర్మూలన పరిశోధనలు,మందులు, ఇంజక్షన్ల తయారీ వంటి వాటితో ఫార్మసీ విద్యకు ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తిస్తుండం తో పరిశోధనలపై ఆధార పడాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఫార్మసీ విద్యను అభ్యసించే విద్యార్థులు పరిశోధనలు, మందుల తయారీ పై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ అరవింద్రెడ్డి, కన్వీనర్ డాక్టర్ సూర్యదేవరకొండ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.గోవర్దన్,పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శివ కేశవ రెడ్డి,ప్టేస్మెంట్ ఆఫీసర్ సుమధరమేశ్,ఏఓ పురుషోత్తంరెడ్డి అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.