హైదరాబాద్: ట్యాంక్ బండ్పై ప్రతివారం జరుగుతున్న సండే-ఫండే (Sunday Funday) కార్యక్రమం అద్భుతంగా సాగుతోంది. ఈ క్రమంలో చార్మినార్ వద్ద కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని కేబినెట్ మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించినట్లు అర్బన్ డెవలప్మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.
సండే-ఫండే వంటి కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద కూడా నిర్వహిస్తే బాగుంటుందని ఈ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రజలు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని అరవింద్ కుమార్ కోరారు. తద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలు ఏర్పరచుకోవడం సులభతరంగా మారుతుందని అరవింద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఈ ఆలోచనను మెచ్చుకుంటున్నారు.