హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న ట్యాంక్బండ్పై ‘సన్డే-ఫన్డే’ చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ గురువారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఈ నెల 22వ తేదీన ముగుస్తున్నందున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కళాకారులు, సంగీతకారులు వచ్చి తమ తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు.
పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ శాఖల సంయుక్త ఆద్వర్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఆర్కెస్ట్రా, తెలుగు పాటలు, ఒగ్గు డోలు, గుస్సాడి, బోనాలు, కోలాటం, చేనేత, హస్తకళల ప్రదర్శన ఉండేలా హెచ్ఎండీఏ చర్యలు చేపడుతున్నది. కాగా పాతబస్తీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరిట నిర్వహించనున్నారు.
Aug 21st Sunday #SundayFunday @ TankBund
&#ekshaamCharminarkeNaam
to conclude #SwatantraBharathaVajrotsavaluCome with friends & family for a relaxed enjoyable evening
Artists / musicians welcome to come & display their talent@KTRTRS @asadowaisi pic.twitter.com/ZKGAW67VaD
— Arvind Kumar (@arvindkumar_ias) August 18, 2022