హైదరాబాద్ : ఫోన్ మాట్లాడొద్దనితండ్రి కూతురిని మందలించడమే నేరమైంది. మనస్తాపం చెందిన విద్యార్థిని తండ్రి కళ్ల ముందే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ – ఛత్రినాకలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కూతురు తేజస్వి(17) సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్నది.
తేజస్వి నిత్యం అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడుతుండడం గుర్తించిన తడ్రి శ్రీనివాస్ అలా మాట్లాడటం తప్పు అని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై అర్ధరాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన తేజస్వి.. ఉప్పుగూడ వద్ద తండ్రి కళ్ల ముందే వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.