సిటీబ్యూరో, నవంబరు 1(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ నార్కోటిక్ ఎన్డీపీఎస్ సెల్కు డైరక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో ప్రత్యేక అవగాహన శిక్షణను పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఏర్పాటు చేశారు. గంజాయి, డ్రగ్స్ కేసులకు సంబంధించి వాటిలో దొరికిన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు నిర్వహించి, విచారణ పూర్తయ్యే వరకు ఆధారాల సేకరణ, వాటి విశ్లేషణ వంటి అంశాలతో పాటు పాటించాల్సిన కీలక సూత్రాలపై డైరక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారి రంగధాంతో శిక్షణను ఇప్పించారు. గంజాయి సరఫరాదారులు,డ్రగ్స్ దందా చేసే వ్యాపారులు, మత్తు పదార్థాల తరలింపుతో పాటు తనిఖీల సమయంలో వాటిని ఎలా పసిగట్టాలి? ఎన్ని కోణాల్లో వీటి రవాణ జరుగుతుంది? వంటి విషయాలపై డీఆర్ఐ అధికారి పలు మెలకువలను సూచించారు. ఈ శిక్షణ శిబిరంలో సైబరాబాద్ క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శిని, న్యాయ సలహాదారులు బుచ్చయ్య, రేవారెడ్డి, నార్కోటిక్స్ ఎన్డీపీఎస్ బృందం అధికారులు పాల్గొన్నారు.