ఉస్మానియా యూనివర్సిటీ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ఈ నెల 13న రాష్ట్ర స్థాయి మహిళా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత శ్రీకుమార్ తెలిపారు. టోర్నమెంట్కు సంబంధించిన బ్రోచర్ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు.
అనంతరం శ్రీకుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మ పండుగలను ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత కవితక్కకే దక్కుతుందని కొనియాడారు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్రంలో మహిళా క్రీడాకారిణీలను ప్రోత్సహించేందుకు క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలను ఈ నెల 9 నుంచి ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఫైనల్ మ్యాచ్ను ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.లక్ష, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 75000, మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50000, నాల్గవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.25000 చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు.
ఆసక్తి ఉన్న వారు టోర్నమెంట్లో పాల్గొనేందుకు 9848772228 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.