TG | మేడ్చల్, మే 20 (నమస్తే తెలంగాణ): టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు తక్షణమే ఉత్తర్వులను అమలు చేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఏదైనా ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ను టీఎస్ బదులుగా టీజీని వాడాలని కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. లెటర్ హెడ్స్ రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్లైన్ జీవోలు ఇతర అధికారిక వెబ్ సైట్లు ఆన్లైన్ జీవోల్లో టీజీగా మార్చాలన్నారు.