సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వేడుకలకు బెంగళూర్ నుంచి హైదరాబాద్కు డ్రగ్ సైప్లె చేస్తున్న ఓ వ్యక్తిని రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 48 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నామని స్టేట్ టాస్క్ఫోర్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి తెలిపారు.
విశ్వసనీయ సమాచారంతో బంజారాహిల్స్ రోడ్డు నం. 10లో ఉన్న పెయింట్ గెస్ట్ హాస్టల్లో దాడి చేసి విజయవాడకు చెందిన హరి సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 48 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితుడిని విచారించడంతో ఒమన్ దేశానికి చెందిన అబ్దురబ్ అనే వ్యక్తి బెంగళూర్లో నివాసముంటూ ఈ డ్రగ్ను సరఫరా చేస్తున్నట్లు తేలిందన్నారు. తన పాత కస్టమర్లలో కొందరిని ఏజెంట్లుగా నియమించుకొని బెంగళూర్ నుంచి అబ్దురబ్ డ్రగ్స్ను హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విచారణ వెల్లడైయిందన్నారు. పరారీలో ఉన్న ఒమన్ దేశస్తుడి కోసం గాలిస్తున్నామని, అరెస్ట్ అయిన నిందితుడిని అమీర్పేట్ ఎక్సైజ్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారని ఆయన తెలిపారు.