ముషీరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం కోసం పట్టువదలకుండా ఉద్యమించి తెలంగాణ తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ ఆదే స్పూర్తితో ఏడేళ్లలో తెలంగాణ గతిని మార్చారని మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి, పట్టుదల కారణంగానే తెలంగాణ సంక్షేమం, అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం ముషీరాబాద్ మహ్మదీయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ప్రజలు కరెంటు, సాగు, తాగు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో ఆయా రంగాల్లో సమస్య లేకుండా చేయగలిగారని అన్నారు.
శాంతిభద్రతల నిర్వహణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, తద్వారా పరిశ్రమల రాక, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం వంటి చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నేత ముఠా జయసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ కార్పొరేటర్లు ముఠా పద్మ, బి.హేమలతారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వై.శ్రీనివాస్, బింగి నవీన్కుమార్, రాకేష్కుమార్, వల్లాల శ్యామ్ యాదవ్, నర్సింగ్ ప్రసాద్, బి.మనోహర్సింగ్, వి.సుధాకర్గుప్త, ఎస్.యాదగిరి, నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, షరిపుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.