మాదాపూర్, మార్చి 22 : లాజిస్టిక్స్ అనేది ప్రపంచ వాణిజ్యానికి జీవనాధారమని ఐఎఫ్ఎస్, డాక్టర్ విష్ణువర్ధన్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో శుక్రవారం ఏర్పాటు చేసిన షిప్పింగ్, లాజిస్టిక్స్పై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ఐఎఫ్ఎస్ విష్ణువర్ధన్రెడ్డి విచ్చేసి షిప్పింగ్, లాజిస్టిక్స్ కమిటీ చైర్మన్ కమల్ జైన్, ఎస్ఎంఈ జాయింట్ సెక్రటరీ మెర్సీ ఇపావో, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ప్రదీప్ పనికర్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ స్వరూప్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాజిస్టిక్స్ ధరను 9శాతం తగ్గించడంపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు ఉండటం వల్ల భారీ ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు.