మేడ్చల్, ఫిబ్రవరి4(నమస్తే తెలంగాణ): రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో వైద్యాధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో శనివారం వైద్యాధికారుల, డేటా ఎంట్రీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ కంటి వెలుగు క్యాంపులు నిర్వహించే వద్ద ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు. ప్రతి వ్యక్తికి కంటి పరీక్షలు చేయాలని సూచించారు. అనంతరం జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.