సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ ) : బంజారాహిల్స్లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో 25న శ్రీ గౌర పూర్ణిమ ఉత్సవం జరుగుతుందని నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయని, ముఖ్య అతిథిగా టెంపుల్ ప్రెసిడెంట్ సత్యగౌరచంద్రదాస హాజరవుతారని వెల్లడించారు.
మహాభిషేకం, హరినామ సంకీర్తన, ప్రత్యేక ప్రవచనాలు, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం వరకు అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.