అమీర్పేట్ : పోస్టల్ శాఖ ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో రూపొందించి అమలు చేస్తున్న వివిధ పథకాలను వినియోగ దారులకు చేరువ చేసే పనులను పోస్టల్ కార్యాలయాలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా వినియోగదారు లకు నగదు సంబంధిత సేవలందించడంలో వినియోగదారులు ఇటీవలి కాలంలో బ్యాంకుల కంటే ఎక్కువగా పోస్టాఫీసుల సేవలనే ఎంచుకుంటున్నారు.
ఆ విధంగా బ్యాంకులతో పోటీ పడుతూ పోస్టల్ విభాగం వినియోగదారుల్లోకి మరింతగా చొచ్చుకుపోతోంది. ఈ నేపధ్యంలో పోస్టల్ శాఖ 5 విభాగాలకు సంబంధించి నిర్ధేశించిన లక్ష్యాలను సమర్ధవంతంగా పూర్తి చేసిన ఎస్ఆర్నగర్ పోస్టల్ కార్యాలయాన్ని 5 స్టార్ రేటింగ్తో సన్మానించనుంది.
బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్ఆర్నగర్ పోస్టల్ కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో హెడ్ క్వార్టర్స్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ టి.ఎం.శ్రీలత ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నారని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ జి.బి.సత్యేంద్ర కృష్ణ తెలిపారు.
ఆఫీస్ ఆఫ్ ది సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, హైదరాబాద్ సిటీ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్నగర్ పోస్టాఫీసు ఆధార్ ఎన్రోల్మెంట్, లోటు పాట్లను పరి చేయడం, సుకన్య సమృద్ధి యోజన కింద అర్హులైన వారిచే నిర్ధేశిత సంఖ్య కంటే ఎక్కువ మొత్తంలో ఖాతాలు తెరిపించడం, పోస్టల్ సేవింగ్స్ అకౌంట్లు, పోస్టల్ లైఫ్ ఇన్షూరెన్స్లు చేయించింది.
అలాగే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపిపిబి) ద్వారా డిజిటల్ అకౌంట్లు తెరిచేలా వినియోగదారుల్లో అవగాహన పెంచడం ద్వారా చక్కటి ఫలితాలు సాధించిన ఎస్ఆర్నగర్ పోస్టల్ కార్యాలయానికి 5 స్టార్ హోదా దక్కబోతోందని తెలిపారు. ఈ మేరకు వివిధ హోదాలతో పోస్ట్మాస్టర్ ఎం.స్వర్ణలతతో పాటు 20 మంది పోస్టమేన్లు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.