సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 25: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ హైదరాబాద్ రీజినల్ లెవల్ అండర్-17 క్రికె ట్ టోర్నమెంట్ను గురువారం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారం (ఓడీఎఫ్)లో ఘనంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న క్రికెట్ పోటీలను ఓడీఎఫ్ కేంద్రీయ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసులు ప్రారంభించారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో 72 కేవీలు ఉండగా, ఇందులో ఏడు టీమ్లు పోటీల్లో తలపడనున్నాయి.
బేగంపేట్, గచ్చిబౌలి, నల్లగొండ, గోల్కొం డ, పికెట్, ఎద్దు మైలారం (ఓడీఎఫ్), విజయవాడ, రాజమండ్రి విద్యాలయాలకు చెందిన 110 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ కౌన్సిల్ క్రికెట్ బోర్డుకు చెందిన ఎనిమిది మంది జడ్జిల సమక్షంలో విద్యార్థులు క్రికెట్ పోటీలను ఆడుతున్నారు. గెలుపొందిన టీమ్లకు మొదటి బహుమతి గోల్డ్ కప్, రెండో బహుమతి సిల్వర్ కప్లతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు మెడల్స్, షీల్డ్లు అందజేస్తామని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పేర్కొన్నారు. 29, 30 తేదీల్లో అండర్-14, 17, 19 విద్యార్థులకు యోగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అండర్-17 పోటీల్లో గెలుపొందిన టీములు నేషనల్ స్థా యికి వెళ్తాయన్నారు. కార్యక్రమంలో పీఈటీ దేవానంద్, ఉపాధ్యాయులు మల్లయ్య, మధుసూదన్ పాల్గొన్నారు.
2022 కామర్వెల్త్ బాక్సింగ్ పోటీలలో పాల్గొన్న తెలంగాణ వాసి మహ్మద్ హుసాముద్దీన్కు సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డితో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ కలిసి గురువారం నాంపల్లి గృహకల్ప ఆవరణలోని జిల్లా శాఖ కార్యాలయంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఉమర్ ఖాన్, సభ్యులు శంకర్, ముఖీం ఖురేషీ, ఈఎన్టీ దవాఖాన యూనిట్ అధ్యక్షుడు తూముకుంట రాజు, సుదర్శన్ గౌడ్, మాజీ కార్యదర్శి జి.ప్రభాకర్, చంద్రశేఖర్, రామక్రిష్ణారెడ్డి, జిల్లా ఏపీఆర్వో మహ్మద్ వహీద్ పాల్గొన్నారు.
– సుల్తాన్ బజార్, ఆగస్టు 25;