బంజారాహిల్స్,నవంబర్ 28: ప్రజల భద్రత కోసం పోలీసుశాఖ తీసుకునే చర్యలకు సంక్షేమ సంఘాల సహకారం అవసరం ఉంటుందని వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ అన్నారు. బంజారాహిల్స్లోని రోడ్డు నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీసీ ఏఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ..కాలనీలు, బస్తీల్లో మరింత మెరుగైన భద్రతను కల్పించేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెట్రోలింగ్ పెంచడంతో పాటు నేరాలు జరగకుండా కృషి చేస్తున్నాం.
పోలీసుల ప్రయత్నాలకు కాలనీ సంక్షేమ సంఘాలు మరింత సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్యే కాలనీని సేఫ్ కాలనీగా మార్చేందుకు గత ఏడాది నేను సైతం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఎమ్మెల్యే కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరగా సొసైటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మాట్లాడుతూ.. కాలనీలో సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తున్నానని, కాలనీలో ఇండ్లు కలిగి ఉన్న వారందరికీ సొసైటీ సభ్యత్వాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇటీవల సొసైటీకి చెందిన ఆస్తులను కాపాడుకోవడంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఫోరం అధ్యక్షురాలు ప్రవీణ, ఉపాధ్యక్షులు నిజాముద్దీన్ మహ్మద్, ప్రభావతి చెన్నమనేని, ప్రధాన కార్యదర్శి ఆనంద్కుమార్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.