మెహిదీపట్నం జనవరి 7: నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకీ పెరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇం దులో భాగం గా మెహిదీపట్నంలో ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేయడానికి ఆసిఫ్నగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
మెహిదీపట్నం నుంచి నగరం వైపు వెళ్లే వాహన దారులకు ఇబ్బందులు కలుగకుండా బస్సుల కోసం రోడ్డుపై వేరుగా దారిని ఏర్పాటు చేశారు. మెహిదీపట్నం పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 19 నుంచి 12 వద్ద ఉన్న బస్టాప్ వరకు బస్సుల కోసం వేరుగా దారిని ఏర్పాటు చేశారు. నానల్నగర్ వైపు నుంచి, మెహిదీపట్నంలో యూ టర్న్ తీసుకునే బస్సులు బస్టాప్లోకి ఈ దారిలోనే వచ్చేలా ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ట్రాఫిక్ చిక్కులు తప్పాయి
మెహిదీపట్నం నుంచి నగరం వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ చిక్కులు తప్పించాలన్న ఆలోచనతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సుల కోసం ప్రత్యేక దారిని ఏర్పాటు చేశాం. దీంతో ప్రస్తుతం మెహిదీపట్నంలో రద్దీ వేళల్లో ట్రాఫిక్ చిక్కులు తప్పాయి. ఆర్టీసీసిబ్బందికి ఖచ్చితమైన ఆదేశాలను ఇవ్వడంతో ట్రాఫిక్ జాం ఏర్పడటం లేదు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎల్లవేళలా కృషి చేస్తున్నాం.
– బాలకృష్ణాగౌడ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్