కీసర, డిసెంబర్ 2: కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామిఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్య లో విచ్చేసి గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ ఐఏఎస్ పూర్వ కీసరగుట్ట ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమెను ఆలయ చైర్మన్ శాలువాతో ఘనంగా సత్కరించి వేదపండితుల చేత ఆశీర్వచనం చేయించారు. అదేవిధంగా చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తులు సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. అనంతరం కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.