బొల్లారం, సెప్టెంబర్ 17: తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ను శుక్రవారం దక్షిణ ఆర్మీ కమాండర్ జేఎస్ నేయిన్, మేజర్ ప్రీతిపాల్ సింగ్లు సందర్శించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో అత్యవసర సేవలందించిన విషయాలను మేజర్ జనరల్ ఆర్కే సింగ్ వారికి వివరించారు. మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ)ని కూడా సందర్శించారు. ఎంసీఈఎంఈలో శిక్షణ అంశాలు, చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కొత్త సాంకేతికత ఆవిష్కరణ గురించి లెఫ్టెనెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్ వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు అందిస్తున్న సేవలకు గాను ఆర్మీ కమాండర్లు వారిని అభినందించారు.