సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): 68వ రైల్వే వీక్ అవార్డ్స్ సెలబ్రేషన్స్లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే(ఎస్సీఆర్) తన సత్తా చాటింది. జాతీయ స్థాయిలో రెండు ఆల్ ఇండియా పర్ఫామెన్స్ ఎఫిషీయెన్సీ షీల్డ్స్ దక్కించుకుంది. ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో శనివారం ప్రగతి మైదాన్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బహుమతులు ప్రదానం చేశారు. ఇందులో ఎస్సీఆర్కు చెందిన డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ డీఎస్ రామారావు, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సీహెచ్. దినేశ్రెడ్డి, డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ మల్లేల శ్రీకాంత్, డివిజనల్ సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్ సి. శివకుమార్, ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ టి. ప్రత్యూష, చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ టి. నటరాజన్, ట్రాక్ మెంటనర్ వీవీ. రంగయ్యలు అతి విశిష్ట్ రైల్ సేవా పురస్కారాలను అందుకున్నారు. గత ఏడాది ఎస్సీఆర్ ప్రదర్శించిన అసాధరణ ప్రతిభకు ఈ అవార్డులు వచ్చినట్టు సౌత్ సెంట్రల్ రేల్వే పేర్కొంది. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్మన్ జయ వర్మ సిన్హా పాల్గొన్నారు.