హైదరాబాద్: హైదరాబాద్ నగరవాసుల ప్రయాణావసరాలను తీర్చుతున్న ఎంఎంటీఎస్ (MMTS) సర్వీలు నేడు పాక్షికంగా రద్దయ్యాయి. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో సోమవారం 36 సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. వీటితోపాటు విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలును సైతం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దయిన ఎంఎంటీఎస్ సర్వీసుల వివరాలు..
హైదరాబాద్-లింగంపల్లి : 18 సర్వీసులు
ఫలకునుమా-లింగంపల్లి : 16 సర్వీసులు
సికింద్రాబాద్-లింగంపల్లి : 2 సర్వీసులు
విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ (12803)