సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): భారతీయ రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులకు ఆశ చూపుతూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దళారుల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో వెలువడుతున్న నోటిఫికేషన్ల వివరాలన్నీ ఆర్ఆర్బీ అధికార వెబ్సైట్లో ఉంటాయన్నారు. రైల్వే ఉద్యోగాలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.
ముంబయికి వెళ్లే ఆరు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) మంగళవారం ప్రకటించింది. ఇందులో ముంబయి-ఆదిలాబాద్, ఆదిలాబాద్-ముంబయి, సికింద్రాబాద్-ముంబయి, ముంబయి- సికింద్రాబాద్, హెచ్ఎస్ నాందేడ్-ముంబయి, ముంబయి-హెచ్ఎస్ నాందేడ్ రైళ్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.