దక్షిణ మధ్య రైల్వే ఘన విజయానికి అంకితభావం కలిగిన సిబ్బంది కృషి ఫలితమే అని జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రశంసించారు. 66వ రైల్వే వార్షికోత్సవాలను పురస్కరించుకుని 171 మంది సిబ్బందికి, అధికారులకు 13 గ్రూపు అవార్డులు, 35 ఎక్సఫీషియో షీల్డ్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన వర్చువల్ విధానంలో రైల్వే అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఊహించని కొవిడ్-19 వైరస్తో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని సమష్టిగా అధిగమించి విజయం సాధించామన్నారు. జోన్ తన రైల్వే నెట్వర్క్కు అదనంగా కొత్తగా 308.8 కిలోమీటర్ల ట్రాక్ పనులతో సరికొత్త రికార్డు నమోదు చేసిందన్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు.